KRNL: కోడుమూరు మండలం కృష్ణాపురం గ్రామంలో రైతుల సమస్యకు బుధవారం తక్షణ పరిష్కారం లభించింది. మంగళమిట్ట రోడ్డులో నాలుగు వాగుల్లో నీరు నిల్వ ఉండడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని రైతులు, నాయకులు కేడీసీసీబీ ఛైర్మన్ డి. విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి దృష్టికి తీసుకెళ్లారు. వారు వెంటనే స్పందించి వాగుల్లో పైపులు ఏర్పాటు చేసి రోడ్డును సరిచేశారు.