TPT: శ్రీ సిటీ పరిధిలోని ఇరుగుళం గ్రామంలో ఎస్సై ప్రియాంక ఆధ్వర్యంలో ఉచిత కంటి, దంత వైద్య శిబిరం నిర్వహించారు. వివిధ సంస్థల సహకారంతో జరిగిన ఈ శిబిరంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పరీక్షలు, చికిత్సలు పొందారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి శిబిరాలు ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంచుతాయని తెలిపారు.