అన్నమయ్య జిల్లాలో పదవ తరగతి పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. అనుమానాస్పదంగా తిరిగే వారిని గుర్తించి కంట్రోల్ రూమ్కు సమాచారం అందుతుంది. కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్ షాపులు మూసివేయాలని ఆదేశించారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్పీ ధీరజ్ తెలిపారు.