AKP: గొలుగొండ(మం) కృష్ణదేవిపేటలో శిధిలావస్థలో ఉన్న సామాజిక భవనం మరమ్మతులు, ప్రహరీ గోడ, సీసీ రోడ్డు పనులను ఎంపీపీ గజ్జల మణికుమారి, సర్పంచ్ పందిరి సత్యనారాయణ బుధవారం ప్రారంభించారు. ఎంపీపీ నిధులలో భవనం మరమ్మతులకు రూ.5 లక్షలు, సీసీ రోడ్డు పనులకు రూ.2.5 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, యువత, గ్రామస్తులు పాల్గొన్నారు.