SRD: మనూరు మండలం బోరంచ నల్ల పోచమ్మ 7 వారాల మహా జాతర త్వరలో జరగనున్నందున కొందరు దాతలు ఏర్పాట్లకు సహకరిస్తున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. ఖేడ్ మండలం జుక్కల్కు చెందిన వీరన్న భక్తుల సౌకర్యం కోసం 3 సిమెంట్ బెంచ్లు ఇస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా బారికేడ్లను, గుడి బ్యానర్లు రాజు, రాజేష్, సూరజ్లు అందిస్తున్నారని చెప్పారు.