KRNL: కర్నూలు నాలుగవ పట్టణ సీఐ విక్రమ్ సింహా న్యాయవాది పవన్పై దాడి చేసిన ఘటనకు నిరసనగా ఇవాళ జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు విధులను బహిష్కరించనున్నారు. జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు హరినాథ్ చౌదరి, ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటేశ్వర్లు తెలిపారు. సీఐపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్పీ విక్రాంత్ పాటిల్కు వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు.