PPM: ఏపీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డి బుధవారం సీతంపేటలో పర్యటించారు. ఈ మేరకు TTD ఆలయంలో శ్రీవారిని కమిటీ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అర్చకులు స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆయన ITDA కార్యాలయ ఆవరణలో అడవి తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు.