KDP: జిల్లాలో పదో తరగతి పరీక్షల సందర్భంగా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షలు ప్రశాంతంగా జరగేందుకు కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలు చేయడంతో పాటు ఫ్రిస్కింగ్ నిర్వహిస్తున్నారు. సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలపై నిషేధం విధించారు.