ASR: అరకు(మం) మాదల పంచాయతీ దాబుగూడ నుంచి కమలతోట వెళ్లే రహదారి నిర్మాణం వెంటనే చేపట్టాలని ఆదివాసీ గిరిజన సంఘం అరకు మండల కమిటీ సభ్యుడు కుమిడి రమేష్ డిమాండ్ చేశారు. ఆయా గ్రామాలకు ఇప్పటికే రహదారి మంజూరైన నిర్మాణం ప్రారంభించలేదని మండిపడ్డారు. రహదారి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు.