NLR: వింజమూరులో ఏప్రిల్ 1న జరిగే “రైతన్న మీసేవలో” కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను మంగళవారం ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పరిశీలించారు. సభా ప్రాంగణం, హెలిపాడ్, వేదిక, పార్కింగ్ వంటి సౌకర్యాలను తనిఖీ చేసి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.