BPT: రేపల్లెలో బూరగలమ్మ పుష్కర కుంభాభిషేక మహోత్సవం భక్తిశ్రద్ధలతో, వేద మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా జరిగింది. ఈ వేడుకలో మంత్రి అనగాని సత్యప్రసాద్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు అనగాని శివప్రసాద్, కొలసాని రాముతో పాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.