MBNR: జిల్లా కలెక్టరేట్ నుంచి కోయిలకొండ ఎక్స్ రోడ్డు వరకు బైపాస్ రోడ్డు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. జేపీఎన్సీ కళాశాల సమీపంలోని వంతెన పనులు పూర్తికావడంతో, వాహనదారులు పట్టణంలోకి వెళ్లకుండానే హైదరాబాద్, కర్నూలు, శ్రీశైలం వైపు సులువుగా ప్రయాణించవచ్చు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయి.