»There Is Danger Of Life Conspiracy Will Happen Jd Lakshminarayana Sensational Allegations
JD Lakshminarayana: ప్రాణహాని ఉంది.. కుట్ర జరుగుతుంది.. జేడీ సంచలన ఆరోపణలు
మాజీ సీబీఐ అధికారి, జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. తనకు ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ వార్త ఏపీలో సంచలనంగా మారింది.
JD Lakshminarayana: సీబీఐ మాజీ అధికారి, జైభారత్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ (JD Lakshminarayana) సంచలన ఆరోపణలు చేశారు. ప్రాణహాని ఉందంటూ ఈరోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏపీ రాజకీయాల్లో ఈ వార్త సంచలనంగా మారింది. ఆయన్ను చంపేందుకు గాలి జనార్ధన్ రెడ్డి(Gali Janardhan Reddy) అనుచరులు పథకం పన్నారని ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం విశాఖ సీపీ (Visaka CP) కి పిటీషన్ ఇచ్చారు. తనకు రక్షణ కల్పించాలంటూ పేర్కొన్నారు.
జేడీ సీబీఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేసే కాలంలో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో గాలి జనార్ధన్ రెడ్డిని, అక్రమ కేసులో ఏపీ సీఎం జగన్ను జైలుకు పంపిన విషయం తెలిసిదే. అంతేకాదు పలువురు ఐఏఎస్ అధికారులను సైతం పలు కేసుల్లో జైలుకు పంపించారు. అందుకనే ఆయనపై కక్ష్య సాధింపు చర్యలలో భాగంగా ఆయన్ను అంతమొందించేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆయన సీపీని కలవడం రాజకీయంగా సంచలనంగా మారింది.