SRCL: వేములవాడ భీమేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యాలపై ఆలయ ఈవో రమాదేవి ప్రత్యేక దృష్టి సారించారు. సోమవారం ఆలయ ప్రాంగణాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రద్దీ దృష్ట్యా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.