HYD: నగరంలో పర్యావరణహిత రవాణా దిశగా కీలక అడుగు పడింది. కేంద్ర ప్రభుత్వ ‘PM E-డ్రైవ్’ పథకం కింద నగరానికి 915 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. వీటిలో కాలనీల కోసం 100 మినీ బస్సులు, ప్రధాన మార్గాల కోసం 815 స్టాండర్డ్ బస్సులు అందుబాటులోకి వస్తాయి. ఈకేఏ మొబిలిటీ-గ్రీన్ సెల్ కన్సార్టియం ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. ఈ బస్సుల వల్ల భాగ్యనగరంలో కాలుష్యం తగ్గనుంది.