IPL-2026 ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్ శిబిరంలో ఆందోళన మొదలైంది. ఆ జట్టు స్టార్ పేసర్ బుమ్రా ఇంకా జట్టుతో కలవకుండా, నేరుగా బెంగళూరులోని బీసీసీఐ ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’కు చేరుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అతను ఏదైనా గాయం కారణంగా అక్కడికి వెళ్ళాడా..? లేదా సాధారణ ఫిట్నెస్ పరీక్షల కోసమేనా..? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.