MBNR: జిల్లాలోని 31 చెరువులు, కుంటలు ఆక్రమణకు గురవుతున్నాయని ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ కలెక్టర్ కుష్బూ గుప్తాకు ఫిర్యాదు చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరో మూడు రోజుల్లో క్షేత్రస్థాయిలో ఆక్రమణల తొలగింపు చర్యలు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తాయని ఆమె స్పష్టం చేశారు.