CTR: బలిజ కండ్రిగ ధర్మరాజు ఆలయం సమీపంలోని అడవిలో జూదం ఆడుతున్న వ్యక్తులపై సోమవారం పోలీసులు దాడులు నిర్వహించినట్టు వెల్లడించారు. ఈ దాడుల్లో ఆరుగురు జూదరులను అరెస్టు చేసినట్టు సీఐ హనుమంతప్ప, పాలసముద్రం ఎస్సై రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో రూ.55 వేల నగదు, 5 బైక్లు, 9 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలియజేశారు.