GDWL: ప్రజావాణికి వచ్చే ప్రతి ఫిర్యాదును వెంటనే ఆన్లైన్లో నమోదు చేసి, బాధితులకు న్యాయం జరిగే వరకు నిరంతరం పర్యవేక్షించాలని గద్వాల జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం ప్రజావాణిలో ఆయన 18 ఫిర్యాదు వచ్చినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. అందులో భూ వివాదాలు, వ్యక్తిగత గొడవలు, మసీదు సీసీ కెమెరాల ధ్వంసం వంటి సమస్యలు ఉన్నాయన్నారు.