TG: భద్రాచల రాముడి వివాదంపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా పడింది. భద్రాచల సీతారాముల గోత్ర, ప్రవరపై వివాదం నడుస్తోంది. ఓ వర్గం దశరథ రాముడని, మరో వర్గం రామనారాయణుడని వాదిస్తున్నారు. 2012 వరకు శ్రీరాముడిని దశరథ పుత్రుడిగా వశిష్ట గోత్రోద్భవడిగా, సీతమ్మ వారిని గౌతమస గోత్రంగా పూజించేవారని, తర్వాత మార్చారని అంటున్నారు. వాస్తవాలు తేల్చేందుకు కోర్టు ఐదుగురితో కమిటీ వేసింది.