SRPT: నడిగూడెం సిరిపురం క్లస్టర్ పరిధిలోని రైతులు రైతు భరోసా కోసం మంగళవారంలోగా దరఖాస్తు చేసుకోవాలని ఏఈఓ రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా పాసుబుక్కులు పొందిన వారు, గతంలో దరఖాస్తు చేయని వారు ఈ అవకాశం వాడుకోవాలన్నారు. పాసుబుక్కు ఆధార్కార్డు, బ్యాంక్ జిరాక్స్లతో రైతు వేదికలో సంప్రదించాలని ఆమె కోరారు.