NLG: భారతదేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ వారి ఉరితాళ్లను ముద్దాడిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు నిజమైన దేశభక్తులని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, చేతి వృత్తిదారుల సంఘం జిల్లా నాయకులు అవిశెట్టి శంకరయ్య కొనియాడారు. చిట్యాలలో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం భగత్ సింగ్ వర్ధంతి సభను నిర్వహించి నివాళులు అర్పించారు.