PLD: వినుకొండ నియోజకవర్గం మదమంచిపాడు వీరాంజనేయ స్వామి తిరునాళ్ల ఎడ్ల పందేల నిర్వహణలో విభేదాలు భగ్గుమన్నాయి. కమిటీ సమావేశంలో సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు రాకపోవడంతో వైసీపీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ అభిప్రాయాలను బేఖాతరు చేస్తున్నారని ఆరోపిస్తూ, రాబోయే ఎడ్ల పందేల కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో గ్రామంలో రాజకీయ వేడి రాజుకుంది.