నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం నెల్లూరు పార్లమెంట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే గౌరవం దక్కుతుందని, కార్యకర్తలే పార్టీకి అసలైన బలం అని ఆయన అన్నారు.