HYD: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పిలుపు మేరకు ఇవాళ అసెంబ్లీని బీజేపీ నేతలు ముట్టడించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని, పాలనలో అవినీతి, కమీషన్ల దందా పెరిగిపోయిందని బీజేపీ ఆరోపిస్తోంది. నిరుద్యోగులు, రైతుల సమస్యల మీద ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసేందుకు శ్రేణులు భారీగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.