కాకినాడ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సామర్లకోట రోడ్డులో పేకాట స్థావరంపై సీఐ మజ్జి అప్పలనాయుడు బృందం ఆదివారం రాత్రి మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో 12 మంది జూదరులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.51 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.