KMM: ఉగాది పండుగ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదివారం మధిరలో ‘ఇందిరా మహిళా డైరీ’ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్య క్షురాలు బి. లలితకుమారి, కార్యదర్శి ఎస్కే చాంద్ బీ పాల్గొన్నారు. డైరెక్టర్లు రేణుక, సీతామహాలక్ష్మి తదితరులు హాజరయ్యారు. మహిళా సాధికారతకు ఇలాంటి కార్యక్రమాలు తోడ్పడతాయని నాయకులు పేర్కొన్నారు.