JN: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయడం లేదని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. లింగాల గణపురంలో మీడియాతో రాజయ్య మాట్లాడుతూ.. బడ్జెట్లో సామాన్య ప్రజలకు మొండి చేయి చూపించారని, ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ మాట తప్పిందని మండిపడ్డారు.