నిర్మల్ పట్టణ కేంద్రంలోని భాగ్యనగర్, గోదాం, ఎన్టీఆర్ మార్గ్, ఈద్గాం, ప్రాంతాలలో రేపు కరెంట్ నిలిపివేస్తున్నట్లు ఏడీ శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. నూతన నియంత్రికలు ఏర్పాటు పనుల కారణంగా విద్యుత్ సరఫరాలో రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కరెంట్ నిలిపి వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వినియోగదారులు గమనించి సహకరించగలరని కోరారు.