KDP: బద్వేల్ మండలం బయనపల్లెలో వైసీపీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి యువత సమావేశం జరిగింది. జిల్లా సేవాదళం అధ్యక్షుడు నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి యువ నాయకుడు దేవసాని ఆదిత్య రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేశాయని తెలిపారు.