అన్నమయ్య: వీరబల్లి మండలం దిగువరాచపల్లెలో ఆదివారం టీడీపీ పార్టీ గ్రామసభ జరిగింది. ఈ కార్యక్రమానికి రాజంపేట టీడీపీ ఇంఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. CM చంద్రబాబు నాయకత్వంతోనే పేదల ఆర్థిక ఉన్నతి,రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక వైకాపా కుట్ర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.