ADB: భగత్ సింగ్ స్ఫూర్తితో విద్య, వైద్య, ఉపాధి అవకాశాలకై ఉద్యమించాలని CITU జిల్లా కార్యదర్శి కిరణ్ అన్నారు. ఆదివారం ఆదిలాబాద్లోని CITU కార్యాలయంలో విద్యార్థి సంఘాల నాయకులతో సమావేశమై మాట్లాడారు. ఈనెల 23న భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ వర్ధంతిని పురస్కరించుకుని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించే ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు.