SRD: సిర్గాపూర్ మండలం పత్యా నాయక్ తండాలో దొంగతనం జరిగిందని ఎస్సై నారాయణ ఆదివారం సాయంత్రం తెలిపారు. తండాలో నిన్న అర్ధరాత్రి గోవింద్ ఇంట్లో ఇద్దరు దొంగలు చొరబడి పెట్టె పగలగొట్టి, అందులోని 1తులం బంగారం, 15 తులాల వెండి ఆభరణాలు అపహరించినట్లు తెలిపారు. దొంగతనం జరిగిన స్థలాన్ని పరిశీలించామని, బాధితుడు గోవింద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.