KKD: రేపటి నుంచి జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి పరీక్షా కేంద్రాలను సామర్లకోట ఎస్సై రాజా ఆదివారం పరిశీలించారు. పరీక్షా కేంద్రాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి స్టేషన్ సిబ్బందితో కలిసి సామర్లకోట పట్టణంలో గల పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.