వనపర్తి జిల్లా రాజనగరం చెరువులో వేల సంఖ్యలో చేపలు మృతి చెందాయి. దీంతో మత్స్యకారులకు భారీ నష్టం వాటిల్లింది. చేపలు కుళ్లిపోవడంతో వెలువడుతున్న తీవ్ర దుర్వాసన వల్ల స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి కాలుష్యం లేదా ఆక్సిజన్ లేమి వల్ల ఈ ఘటన జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.