MDCL: అల్వాల్ పట్టణ పరిధి మచ్చ బొల్లారంలోని సర్వేశ్వరుని గుట్ట సర్వేశ్వరాలయంలో ఆదివారం గో ఆధారిత ఉత్పత్తులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గోసేవ శిక్షణ వర్గ్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పంచగవ్య వినియోగం, గో ఉత్పత్తుల తయారీ, టెర్రస్ గార్డెనింగ్పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గుమ్మడవెల్లి శ్రీనివాస్, యతేంద్ర, మనోజ్ తదితరులు ఉన్నారు.