ELR: ద్వారకాతిరుమల మండలం పావులవారిగూడెం గ్రామ పరిధిలో ఇటీవల జరిగిన గేదెల దొంగతనం కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. CC ఫుటేజ్ ఆధారంగా, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గేదెలను దొంగలించిన వారిని అరెస్ట్ చేసినట్లు ద్వారకాతిరుమల SI T. సుధీర్ ఆదివారం తెలిపారు. మిడతా వెంకన్న, కడారి కృష్ణ, కడారి సురేష్, ఉప్పాటి సుబ్రహ్మణ్యంలను అరెస్ట్ చేశామన్నారు.