SKLM: కోటబొమ్మాళి(M) తిలారులో ఇప్పిలి షణ్ముఖరావు గత కొంతకాలంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారు. సంతబొమ్మాళి మండలం గోవిందపురం గ్రామానికి చెందిన రెయ్యమ్మతల్లి యూత్ హెల్పింగ్ హ్యాండ్స్ సేవాసొసైటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఆయనకు రూ. 15వేలు అందజేశారు. మాజీ ఎంపీపీ తర్ర రామకృష్ణ చేతులు మీదుగా ఈ నగదును ఇప్పించారు. పేద కుటుంబం కావటంతో సహాయం చేసినట్లు తెలిపారు.