MDK: మనోహరాబాద్ మండలం పోతారం గ్రామంలో జల్ జీవన్ మిషన్ కార్యక్రమం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ ఏఈ దివ్య నీటి నాణ్యతను పరీక్షించి వివరించారు. బోరు, ఆర్వో నీటితో పోలిస్తే మిషన్ భగీరథ నీటిలో అవసరమైన మినరల్స్ సమతుల్యంగా ఉంటాయని తెలిపారు. ప్రజలు భగీరథ నీటినే వినియోగించాలని సూచించారు.