BHPL: ఈనెల 28వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగపరచుకోవాలని కాలేశ్వరం ఎస్సై జీ. తమాషారెడ్డి సూచించారు. రాజీమార్గమే- రాజామార్గం అని, రాజీతో సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. కేసులు రాజీ కావాలనుకునేవారు పోలీస్ అధికారులను సంప్రదించాలని, లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే పరిష్కారం జరుగుతుందన్నారు.