KDP: సింహాద్రిపురం (M) బలపనూరులో నగరికుంట, రాగికుంట, నాగులకుంట, ఊరుకుంటలు పూర్తిగా ఎండిపోవడంతో భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం పడింది. సుమారు 400 ఎకరాల్లో అరటి, మొక్కజొన్న పంటలు సాగు చేయడానికి సిద్ధమవుతున్న రైతులు నీటి కొరతతో ఆందోళన చెందుతున్నారు. బలపనూరు డిస్ట్రిబ్యూటర్ని కాలువలకు మళ్లించి కుంటలు నింపితే వేసవిలో ఉపయోగపడుతుందని రైతులు కోరుతున్నారు.