MNCL: కోటపల్లి మండలం కాలేశ్వరం నుంచి బెల్లంపల్లి వెళ్లే బైక్ బోరంపల్లి వద్ద ఆదివారం బైక్ అదుపుతప్పి కింద పడింది. బెల్లంపల్లికి చెందిన జీదుల రాజ్ కుమార్, సరిత తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. 108కు ఫోన్ చెయ్యగా కోటపల్లి 108 సిబ్బంది అక్కడికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.