శ్రీకాకుళం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జడ్పీ ఛైర్మన్ అధ్యక్షతన స్థాయి సంఘాల సమావేశం నిర్వహించారు. ఆదివారం ఈ సమావేశంలో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో పీఎసీఎస్లలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై సమగ్రంగా చర్చించారు.