TG: కనీస మద్దతు ధరతో పాటు వరికి బోనస్ కూడా ఇస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. అవసరం ఎక్కువ ఉన్న పంటలకు బోనస్ ఇచ్చి ప్రోత్సహించాలనేది సీఎం ఆలోచన అని చెప్పారు. రాష్ట్రంలోనే తొలిసారిగా రిఫైనరీని కూడా సిద్ధిపేట జిల్లాలోనే నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. ఇదే వేదిక పైనుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నామని ప్రకటించారు.