MNCL: రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ డాక్టర్ షమీమ్ అక్తర్ జన్నారం మండలంలో పర్యటించనున్నారని జిల్లా అధికారులు వెల్లడించారు. సోమవారం జన్నారం మండలంలోని కవ్వాల్ పులుల అభయారణ్యంలో నివసిస్తున్న గిరిజనులతో సమావేశం నిర్వహించి వారికి కల్పిస్తున్న సౌకర్యాలను అధికారులతో సమీక్షిస్తారన్నారు. ప్రభుత్వ సంస్థలను సందర్శించి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహిస్తారు.