ADB: రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందజేస్తున్న ప్రైవేటు, ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. నేరడిగొండ మండలంలోని వాడూరు గ్రామంలో శ్రీకృష్ణ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. సిబ్బంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు.