CTR: ఇవాళ పెరుమాళ్ళపల్లెలో జరిగిన విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుడా ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి గురించి వివరించారు. విశ్రాంతి ఉద్యోగుల సంక్షేమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఉద్యోగులు పాల్గొన్నారు.