JGL: ఇబ్రహీంపట్నం మండలం భర్తీ పూర్ గ్రామంలో గోదావరి నదిలో చేపలు పట్టడానికి వెళ్లి గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన చెట్టి వెంకటేశ్(25) గ్రామ శివారులోని గోదావరి నదిలో చేపలు పట్టడానికి శనివారం వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. ఇవాళ ఉదయం గాలించగా మృతదేహంను కనుగొని బయటకు తీశారు.