KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 గ్రామంలోని భద్రావతి భావనారాయణ స్వామి ఆలయంలో గత కొన్ని నెలలుగా గ్రామంలోని పిల్లలకు ప్రతి ఆదివారం భగవద్గీత పారాయణం నేర్పిస్తున్నట్లు గురువులు రూపా వెంకటలక్ష్మి తెలిపారు. తరగతులకు పిల్లల నుంచి విశేష స్పందన లభిస్తోందని, చిన్నారులు భగవద్గీత శ్లోకాలను కంఠస్థంగా, స్పష్టంగా పలుకుతూ చెప్తుండడం ఆనందాన్ని కలిగిస్తుందని ఆమె తెలిపారు.