NZB: బోధన్ మండలం కల్దుర్కిలో ఈ నెల 25 నుంచి వారాంతపు సంతను తిరిగి ప్రారంభించనున్నారు. గ్రామస్తుల సౌకర్యార్థం ప్రతి బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ సంత నిర్వహించనున్నట్లు వీడీసీ కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామం, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిటీ విజ్ఞప్తి చేసింది.